టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ తెరెకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో మరో మూవీలో నటించబోతున్నారు ఎన్టీఆర్.  టెంపర్ సినిమా తర్వాత వరుసగా విజయాలు అందుకుంటున్నారు ఎన్టీఆర్.  ఐతే త్రివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ పారితోషకం భారీగా పెంచేశాడట. దాదాపు తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి 30-40 శాతం పెంచేసినట్లు టాక్ వినిపిస్తుంది. 

 

గతంలో తన సినిమా విషయంలో నిర్మాతల పరిస్థితిని బట్టి తన రెమ్యూనరేషన్ సెట్ చేసే ఎన్టీఆర్ ఇప్పుడు తన డిమాండ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది.  అప్ కమింగ్ హీరోలు ఒకటీ రెండు హిట్స్ తర్వాత తమ రెమ్యూనరేషన్ పెంచేస్తున్న విషయం తెలిసిందే.  సాధారణంగా ఎన్టీఆర్ 25 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం . ఆర్.ఆర్.ఆర్ కొరకు ఆయన ఎక్కువ తీసుకున్నారట. ఆర్.ఆర్.ఆర్ విడుదల తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది.  ఈ మూవీ గనక హిట్ అయితే జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది.. అలాంటపుడు తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా మార్పులు తేవాలనే ఆలోచనలో ఈ యంట్ టైగర్ ఉన్నట్టు తెలుస్తుంది. 

 

అందుకే త్రివిక్రమ్ మూవీ కొరకు దాదాపు 50కోట్ల రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారని తెలుస్తుంది.  అల.. వైకుంఠపురములో సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు అదే తరహాలో తారక్ తో కూడా మంచి  ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమాలను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ కి జతగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసింది. త్రివిక్రమ్ సినిమాను కళ్యాణ కళ్యాణ్ రామ్ చినబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: