ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కూడా ఫేక్ వార్తల బెడద ఎక్కువైపోయింది. దీంతో ప్రేక్షకులకు కూడా అయోమయంలో పడిపోతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ఫేక్ వార్త తెరమీదికి వస్తూనే ఉంది. మరి ఈ వారం మొత్తంలో ఎక్కువగా తెర మీదికి వచ్చి ప్రేక్షకులను అయోమయంలో పడేసిన  ఫేక్ వార్తలు ఏమిటో తెలుసుకుందాం రండి. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జిస్ గా కొనసాగిన నాగబాబు... ఆ తర్వాత జబర్దస్త్ షో నుంచి తప్పుకొని అదిరింది అనే షోని  జీ తెలుగులో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ షో  మాత్రం జబర్దస్త్ షో  అంతగా రేటింగ్ సాధించలేక పోతుంది. దీంతో మరోసారి జబర్దస్త్ వైపు మెగా బ్రదర్ నాగబాబు చూపు మళ్లింది అని త్వరలో జబర్దస్త్ లోకి  నాగబాబు రాబోతున్నారు అంటూ బుల్లితెరపై తెగ ప్రచారం జరిగింది. 

 

 

 ఇంకొన్ని రోజుల్లో జబర్దస్త్ జడ్జిస్ గా నాగబాబు కనిపించబోతున్నారని... మరోసారి జబర్దస్త్ లో సందడి మొదలు కాబోతుంది అంటూ ఎన్నో వార్తలు తెర మీదికి వచ్చాయి. కానీ వాస్తవంగా అలాంటిది ఏమీ లేనట్లు తెలుస్తోంది. నాగబాబు కేవలం అదిరింది షోనే  కొనసాగిస్తారని మళ్లీ జబర్దస్త్ లోకి వెళ్లే అవకాశం లేదు అని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే యాంకర్ అనసూయ కూడా త్వరలో జబర్దస్త్ షో నుండి తప్పకోనున్నారని  వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. జబర్దస్త్ యాంకర్ గా తనదైన యాంకరింగ్ తో రక్తి కట్టిస్తున్న అనసూయ కొన్ని రోజుల్లో... జబర్దస్త్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి. 

 

 

 

 కానీ ఈ వార్తల్లో నిజం లేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు జీ తెలుగు లో ప్రసారమయ్యే గ్యాంగ్ లీడర్ షోలో  జడ్జిగా అదరగొడుతోంది అనసూయ. మరోవైపు తాజాగా ప్రతిరోజూ పండగే అనే సరికొత్త ప్రోగ్రాంతో తెర మీదికి వచ్చి అలరిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఓ వైపు తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోలో కొనసాగితూనే  మరోవైపు కొత్త ప్రోగ్రాం లతో బుల్లి తెరపై మరింత క్రేజ్ సంపాదించుకున్న బుల్లితెర ప్రేక్షకులు అందరిని అలరించాలని అనసూయ  అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనసూయ జబర్దస్త్ షో నుంచి యాంకర్ గా తప్పుకుంటుంది అని వస్తున్న వార్తలు వాస్తవం కాదు అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: