యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్ సేన్ , చి ల సౌ ఫేమ్ రుహాణి శర్మ  జంటగా నటించిన చిత్రం హిట్. మొన్న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్  ను తెచ్చుకోవడం తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈచిత్రం 1.32 కోట్ల షేర్ ను రాబట్టగా రెండో రోజు 1.09 కోట్ల షేర్ తో రెండో రోజుల్లో 2.41 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. మరో రెండు కోట్లు రాబడితే చాలు ఈసినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే. అయితే ఈ చిత్రానికి నితిన్, భీష్మ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. 
 
శైలేష్ కొలను  తెరకెక్కించిన  ఈ హిట్ ను వాల్ పోస్టర్ సినిమాస్ పతాకం పై నేచురల్ స్టార్ నాని , ప్రశాంతి సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఇక ఈనగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ తో బ్యాట్ టు బ్యాక్ ప్లాప్ లను ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్ ఎట్టకేలకు హిట్ తో హిట్ కొట్టాడు. 
 
హిట్ రెండవ  రోజు వసూళ్ల వివరాలు : 
నైజాం - 67 లక్షలు 
సీడెడ్ - 9 లక్షలు 
ఉత్తరాంద్ర - 11 లక్షలు 
గుంటూరు - 4 లక్షలు 
తూర్పు గోదావరి - 5 లక్షలు  
పశ్చిమ గోదావరి - 5 లక్షలు 
కృష్ణా - 5 లక్షలు  
నెల్లూరు - 3 లక్షలు  
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండవ రోజు షేర్ = 1.09 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: