పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. దాంతో ఇఫ్పుడు సక్సెక్ కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాలతో ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ దేవాలయాల్లో జరుగుతున్న మాఫియాపై ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ మూవీలో మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్నారు.
ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ను మొత్తం ఇప్పుడు కొరటాలనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ విషయంలో ఇప్పుడు దర్శకులు, హీరోలు కూడా ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూషన్ హక్కులు, శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఇలా ప్రతీది తానే చూసుకుంటున్నారట కొరటాల. ఇక తనకు సన్నిహితంగా ఉన్న వారికి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తున్నారట కొరటాల. అయితే ఈ మూవీ నైజాం, గుంటూరు హక్కులను తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు చాలా ప్రయత్నించారట.
కానీ ఇక్కడే ఆయనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారట కొరటాల. నైజాం రైట్స్ లక్ష్మణ్ , ఉత్తరాంధ్ర హక్కులను సుధాకర్ అనే తన సన్నిహితుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో దిల్ రాజు సైతం కాస్త చిన్న బుచ్చుకున్నట్లు టాలీవుడ్ లో సమాచారం. ఇక దిల్ రాజు సంస్థ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్.. పవన్ కల్యాణ్- క్రిష్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగానే కాకుండా.. ఇప్పుడు బిజినెస్ విషయంలో కూడా తన సత్తా చాటబోతున్నట్లు తెలుస్తుది.