యంగ్
హీరో అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు
భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నచిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్. ఈసినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇటీవల ఈ చిత్రం నుండి
అఖిల్ ఫస్ట్ లుక్ విడుదల కాగా ఆ తరువాత
హీరోయిన్ పూజా హేగ్దే లుక్ ను విడుదలచేశారు. ఈరెండింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ
సినిమా నుండి మొదటి సాంగ్ కూడా రానుంది. అందులో భాగంగా ప్రముఖ గాయకుడు
సిద్ శ్రీరామ్ ఆలపించిన మనసా ,మనసా అనే సాంగ్ ను రేపు ఉదయం 10:45 గంటలకు విడుదలచేయనున్నారు.
ఇదిలావుంటే ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు మే లో ప్రేక్షకులముందుకు తీసుకొస్తే బాగుంటుందని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. దాంతో ఈ
సినిమా ను మే 22విడుదలచేయనున్నారని సమాచారం. త్వరలోనే విడుదల తేది పై క్లారిటీ రానుంది. ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి
గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై
బన్నీ వాసు, వాసు
వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరస విజయాలతో
గీతా ఆర్ట్స్ 2 అలాగే పూజాహెగ్డే ఫుల్ ఫామ్ లో ఉండడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలే వున్నాయి.
ఇక
అఖిల్,
హలో,
మిస్టర్ మజ్ను తో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన అఖిల్.. ఈ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మొదటి హిట్ ఇస్తుందనని కాన్ఫిడెంట్ గా వున్నాడు.
అఖిల్ తోపాటు
డైరెక్టర్ బొమ్మరిల్లు
భాస్కర్ కు కూడా ఈ
సినిమా విజయం కీలకం కానుంది. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తోనైనా వీరిద్దరు బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి. ఈసినిమా తరువాత
అఖిల్ ఇప్పటివరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.