టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా ఎంతో ఇబ్బందులు పడ్డ నితిన్ ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అ..ఆ.. సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు నితిన్. వరుస ఫ్లాపుల కారణంగా మరోసారి కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందన్న సందర్భంలో వెంకి కుడుముల రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ఆయన దర్శకత్వంలో భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ మూవీ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే.
పిబ్రవరి 21 న విడుదైన ఈ చిత్రం నితిన్ కెరియర్లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ వీక్ 23.6 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఉన్న టాక్ కు కలెక్షన్స్ కుమ్మేస్తూ ఉంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్లు చేసారు. ఇప్పటికే 24 కోట్లు పైగా వచ్చేసింది. కాబట్టి నష్టపోయేదేమ నష్టపోయేదేమి ఉండు. అయితే లాభాలే ఏ స్దాయిలో ఉంటాయనేది తేలాల్సిన విషయం. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్కు నితిన్ లాక్ చెయ్యటమే ప్లస్ అయ్యింది. దానికి తోడు ఫామ్ లో ఉన్న రష్మిక మందన హీరోయిన్గా నటించటంతో ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. నితిన్ కి ఈ మూవీ బాగా కలిసి వచ్చింది.
తర్వాత మరో రెండు సినిమాలకు కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఈ మూవీలో కామెడీతో పాటు రైతులకు మంచి మెసేస్ ఉండటంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇటీవల ఖైదీ నెంబర్ 150, మహర్షి లాంటి సినిమాలు వరుసగా రైతుల సమస్యలపై వచ్చి మంచి విజయం అందుకున్నాయి. మరి భీష్మ కు కలెక్షన్లకు పరీక్షల సమయం ఇబ్బందులకు గురి చేస్తుందేమో అని సినీ విశ్లేషకులు అంటున్నారు.