అక్కినేని అఖిల్… అక్కినేని వారసుడు గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు ..బాబు ఏమంటూ అడుగు పెట్టాడో ఇంత వరకు చెప్పుకో దగ్గ సినిమా చేయలేదు ..కుటుంబానికి మంచి పలుకుబడి ఉన్నా సరే, సినిమాల్లో ఆ క్రేజ్ మాత్రం ఉపయోగపడలేదు. అఖిల్ అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం అనే సినిమాలో  చిన్న పాత్ర ద్వారా సినీ ప్రవేశం చేసాడు.. తర్వాత వి వి  వినాయక్ దర్శకత్వంలో  అఖిల్ అనే సినిమాలో హీరో గా వెండి తెరకు పరిచమయ్యాడు.. ఆ సినిమా అంచనాలకు మించిన వచ్చిన బాక్సఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

 

అఖిల్ ఆ తర్వాత హలో అనే సినిమా అంటూ వచ్చి బాయ్ చెప్పేసి వెళ్ళాడు. అంత ఘోరం గా ఆ సినిమా నిరాశపరిచింది. ఈ సినిమాలో అతని నటన చూసి ఇతనికి సినిమాలు దండగ అని సినీ విమర్శకులు విమర్శించారు. అయినా అతను ఎక్కడ నిరాశ పడకుండా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అంటూ అలరించాడు. ఈ సినిమా నటన ప్రకారం పర్వాలేదు అనిపించినా అనుకున్నంత విజయం సాధించలేదు. దానితో అతను సినిమాలకు కొంచెం విరామము ఇచ్చాడు ..

 

నాగార్జున ,అఖిల్ సినీ భవిష్యత్తు విషయం లో భయపడిపోతున్నారు అంట. అందుకే తానే స్వయంగా కథలు ఎంపిక విషయం లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని టాక్. అంతే కాకుండా సమంత కూడా ఈ విషయం దృష్టి పెట్టారు అని ఇండస్ట్రీ లో వినికిడి. కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టి తీసిన అవి బాక్సాఫీస్ వద్ద బోర్లాపడతాయి. అఖిల్ ప్రస్త్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో బ్యాచిలర్ అనే మూవీ లో నటిస్తున్నాడు. పూజ హెగ్డే అఖిల్ పక్కన జోడి కట్టనున్నది. చూద్దాం ఈ సినిమా ప్రేక్షకలను ఏ విధంగా అలరిస్తుందో. త్వరలో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: