ఈ మద్య నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత ఆయన నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో ఆలోచనలో పడ్డారు. గతంలో ఆయనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీనివాస్ తో ఇప్పుడు ఓ సినిమాలో నటిన్నారు. ఈ మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాలయ్య. రామ్ చరణ్ తో వినయ విధేయరామ తో ఫ్లాప్ అందుకున్న బోయపాటి సైతం తన తదుపరి సినిమాపై ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు. వీరిద్దరికి ఒక హిట్ ఎంతో అవసరం అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్లు.. ముగ్గురు హీరోయిన్ల హడావుడి ఏవీ లేకుండా బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఒక సినిమాకు బలం సంగీతం. మూవీలో సాంగ్స్ హిట్ అయితే ఆ ప్రభావం ఎంటైర్ మూవీపై కూడా ఉంటుందని అంటున్నారు. ఈ మద్య పాత పాటలు రిమిక్స్ చేస్తూ మంచి హిట్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా అప్పుడప్పుడు రిమిక్స్ చేస్తుంటారు. పైసా వసూల్ సినిమా కోసం తన తండ్రి ఎన్టీఆర్ నటించిన 'జీవిత చక్రం' సినిమాలోని "కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది..." అనే పాటను రీమిక్స్ మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీలో తన పాటనే రీమిక్స్ నేటి తరానికి, ట్రెండ్ కు అనుగుణంగా రీమిక్స్ చేయాలని చెప్పారట.
ఈసారి మాత్రం తన పాటను తానే రీమిక్స్ చేయబోతున్నాడట. బోయపాటి సినిమా కోసం 'బంగారు బుల్లోడు' మూవీలోని 'స్వాతిలో ముత్యమంత' గీతాన్ని రీమిక్స్ చేయనున్నాడట నటసింహ. రాజ్-కోటి స్వరపరిచిన ఈ గీతాన్ని.. నేటి ట్రెండ్కి తగ్గట్టు తీర్చిదిద్దుతున్నాడట సంగీత దర్శకుడు తమన్. ఏదిఏమైనా.. తమ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణ-బోయపాటికి.. ఈ రీమిక్స్ గీతం ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.