ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వైసీపీలో చేరిన కమెడియన్ అలీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో జరిగింది. అలీ కి తాను ఎంతో సహాయం చేశా అని పవన్ కళ్యాణ్, నాకు ఏ సినిమాలో ఆయన అవకాశం ఇచ్చారు అని అలీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య కూడా ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అంతా ప్రశాంతంగానే కనపడుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకోవడం లేదు. 

 

ఇప్పుడు పవన్ సినిమాలో అలీ నటిస్తున్నాడు అనే టాక్ వినపడుతుంది. మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కలిసి నటించడానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియకపోయినా టాలీవుడ్ జనాలు మాత్రం కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కలిసి నటించడానికి కారణం వారి ఇద్దరి ఉమ్మడి స్నేహితుడు త్రివిక్రమ్ అంటున్నారు. ఆయన కారణంతోనే వాళ్ళు నటిస్తున్నారని మళ్ళీ ఎప్పటిలా కలిసి ఉంటున్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య ఆయన కుదిర్చారని అంటున్నారు. 

 

అలీ తల్లి మరణించిన తర్వాత పవన్, త్రివిక్రమ్, అలీ ఒక ప్లేస్ లో కలిసారు అంటున్నారు. ఆ సమావేశంలోనే త్రివిక్రమ్ కూల్ చేసినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఇద్దరూ మళ్ళీ దగ్గరయ్యారని, భవిష్యత్తులో ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: