ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎందరో అభిమానుల క్రేజ్ తో పాటు, మంచి పేరుతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేష్ ఇద్దరూ కూడా ముందుకు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఎవరికీ వారు ఒకరిని మించేలా మరొకరు పలు సినిమాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేవలం పెద్ద సినిమాలనే కాకుండా, పలువురు చిన్న నటుల సినిమాలు కూడా మధ్యలో ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ తమ క్రేజీ ప్రాజక్ట్స్ తో ఎంతో బిజీ బిజీగా ముందుకు సాగుతున్నారు. 

 

ఇకపోతే ఈ ఇద్దరూ కూడా ఒక సినిమా విషయంలో పోటీ పడ్డారని, అయితే, చివరికి ఇద్దరిలో కీర్తి విజేతగా నిలిచిందని అంటున్నారు. ఇక ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఇటీవల సంచలన దర్శకుడు తేజ  తన తదుపరి చేయబోయే రెండు సినిమాల టైటిల్స్ ని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడం జరిగింది. అయితే వాటిలో ఒకటి 'అలమేలు మంగ - వెంకటరమణ'. యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాని తేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, అలానే ఈ సినిమాలోని ఎంతో కీలకమైన హీరోయిన్ పాత్రకు ముందుగా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని భావించారట తేజ. 

 

అయితే ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, ప్రస్తుతం ఆమె స్థానంలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ని తీసుకునేందుకు తేజ ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి కాజల్ ని టాలీవుడ్ కి లక్ష్మి కళ్యాణంతో పరిచయం చేసింది తేజనే, అలానే ఆమెతో ఇటీవల నేనే రాజు నేనే మంత్రి, సీత సినిమాలు తీసిన తేజ, హఠాత్తుగా ఆమెను ఈ మూవీని తప్పించడం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగవలసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: