టాలీవుడ్ లో ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త జోరుగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 152 వ సినిమాగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఈ పాత్రకు మహేష్ బాబు అయితేనే కరెక్ట్ అని చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివ భావించడంతో మహేష్ బాబును అప్రోచ్ అయ్యారని.. ఇందుకు మహేష్ కూడా ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆయ‌న‌కు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఇస్తున్న‌ట్టు టాక్‌.. ?



ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ఇక్క‌డే కథ అడ్డం తిరిగింది అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుల్లో మహేష్ బాబు చేయాల్సిన పాత్రలో తానే నటించాలని బన్నీ పట్టుదలతో ఉన్నాడట. బన్నీ తండ్రి అల్లు అరవింద్ సైతం తన తనయుడిని కాదని చిరంజీవి పక్కన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మహేష్ బాబుకు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రెండు ఫ్యామిలీల మధ్య చిన్న పాటి మనస్పర్ధలున్నాయని బలమైన ప్రచారం ఉంది. అల వైకుంఠపురములో సక్సెస్ పై ఆ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరు స్పందించలేదు.



ఇక బ‌న్నీ ఎప్పుడూ ముందుగా చిరు జపం చేయ‌కుండా ప్ర‌సంగం ప్రారంభించ‌డు. అలాంటోడు ఇటీవ‌ల త‌న తండ్రి అర‌వింద్ ప్ర‌స్తావ‌నే ఎక్కువుగా తీసుకు వ‌స్తున్నాడు. ఇక ఈ విష‌యంలో చిరు సినిమాలో బ‌న్నీని న‌టింప జేసేలా చేసేందుకు అర‌వింద్ ఇప్ప‌టికే చిరు, నిర్మాత రామ్ చ‌ర‌ణ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. ఈ విష‌యంలో తేడా వ‌స్తే మెగా ఫ్యామిలీ వార్ మ‌రింత ముద‌ర‌డం ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఈ సినిమాలో చిరు ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తారో ?  అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చే వ‌ర‌కు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: