ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ ప్రజలందరినీ కలవరపెట్టేస్తోంది. ఇప్పటికే వైరస్ కారణంగా సుమారు 2800 మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది వైరస్ బారిన పడగా ఇంకా వైరస్ ను నివారించే మందు కనిపెట్టలేదు. మరొకవైపు రుగోస్ వైరస్ కారణంగా ఏపీలోని పండ్ల తోటలు అన్నీ నాశనమవుతుండగా కోళ్ళకి ఇంకొక వింత వైరస్ సోకి మరణిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో మరో వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. దాని పేరే మంకీ వైరస్.

 

IHG

 

ఇప్పటికే మంకీ వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. వ్యాధిని శివమొగ్గ ప్రాంతంలో మొదటిసారి గుర్తించగా ఇప్పటికే దీని బారిన 55 మంది పడినట్లు తెలిసింది. అయితే స్థానికంగా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కారణంగా సిద్దాపురం కు చెందిన భాస్కర గణపతి హెగ్డే అనే మరో మహిళ మృతి చెందింది. వైద్యులు ఫీవర్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొంచెం నలతగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచనలు ఇస్తున్నారు.

 

IHG

 

మంకీ ఫీవర్ వస్తే వారం రోజుల వరకు లక్షణాలు కనిపించవు. తర్వాత జ్వరం, తలనొప్పి, నరాల బలహీనత వాంతులు, తిమ్మిర్లు ఉంటాయి. బీపీ, ఎర్రరక్త కణాలు తగ్గడం కనిపిస్తుంది. వ్యాధి తీవ్రమయ్యాక నోరు పంటి చిగుళ్లు ముక్కు నుండి రక్తం వస్తుంది. ఇది పెరిగితే మనిషి మతిస్థిమితం కోల్పోయే ప్రమాదముంది. మంకీ ఫీవర్కు సంబంధించి అన్ని వ్యాక్సిన్ల స్టాక్స్ తమ వద్ద ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కరోనా లాగా పేషంట్ లక్షణాలతో దీన్ని గుర్తించడం కష్టం. ఇక పోతే వారం రోజులు దీని లక్షణాలు బయటపడవు కాబట్టి నిర్లక్ష్యం చేస్తే ఇది కరోనా కన్నా బాగా ప్రమాదమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి: