తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం లో కొలువై ఉన్న శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి... అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే దేశ నలుమూలల నుంచి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో  శ్రీవారి దర్శన భాగ్యం పొందుతూ ఉంటారు. ఇక కాలంతో సంబంధం లేకుండా ప్రతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది అన్న విషయం తెలిసింది. అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్లు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. . అందులో కొత్తగా ఏముంది అంటారా.. ఆ హీరోయిన్ వెళ్తున్నది కారులోనూ ట్రైన్ లోనో కాదు కాలినడకన తిరుపతి కి వెళ్తున్నారు హీరోయిన్లు. 

 

 

 

 నలుగురు హీరోయిన్లు ఒకేసారి కాలినడకన తిరుమలకు వెళ్ళారు. ఈ ఆసక్తికర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమ సినిమా మంచి విజయం సాధించాలని ఏడుకొండల కు కాలినడకన వచ్చి  శ్రీవారిని దర్శించుకున్న వారు తెలిపారు. ధన్య బాలకృష్ణత్రిధా చౌదరిసిద్ధి ఇద్నానికోమలి ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బాలు అడుసుమిల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్,  పూర్వి పిక్చర్స్ పతాకంపై హిమబిందు వెలగపూడి,  వేగి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా మార్చి ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

 అయితే యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు. ఈరోజుల్లో ఎంజాయ్మెంట్ శృతిమించితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో  ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము  అంటూ ఆయన తెలిపారు. కామెడీ థ్రిల్లర్ గ ఈ సినిమాను తెరకెక్కించామని ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో... నలుగురు హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ మొత్తం తిరుమలకు కాలినడకన వెళ్లారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడక మొదలుపెట్టిన వీరంతా తిరుమల వెళ్లారు. కాగా ప్రస్తుతం హీరోయిన్లు కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అయితే  ప్రేక్షకులందరూ రెండున్నర గంటల పాటు కడుపుబ్బ నవ్వుకోడానికి ఈ సినిమా చూడటానికి  థియేటర్లకు రావాలి అంటూ ఈ నలుగురు భామలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: