గత ఏడాది
మజిలీ,
వెంకిమామ తో బ్యాట్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫామ్ లోకి వచ్చిన
యువ సామ్రాట్ నాగ
చైతన్య నటిస్తున్న లేటెస్ట్
మూవీ లవ్ స్టోరీ.
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ కాంబినేషన్ లో
సినిమా అనే సరికి మాములుగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ
సినిమా నుండి విడుదలైన ఏయ్ పిల్ల మ్యూజికల్ ప్రివ్యూ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకొని
సినిమా పై వున్న అంచనాలను మరింతగా పెంచింది. ఈ ఒక్క ప్రోమో
సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామని అనే ఫీల్ తెప్పించింది.
అయితే సమ్మర్ లో విడుదలకావల్సిన ఈ చిత్రం వాయిదాపడి జూలై లో విడుదలవుతుందని గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈన్యూస్ లవ్ స్టోరీ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. తాజాగా
దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. విడుదల వాయిదాపడింది అనే దాంట్లో నిజం లేదు అవన్నీ రూమర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ ను వెల్లడిస్తామని తెలిపారు. అన్నికుదిరితే ఏప్రిల్ చివర్లో ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను వీకెండ్ సినిమాస్ 5.5కోట్లకు దక్కించుకోగా తెలుగురాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. సీనియర్ నటీనటులు రాజీవ్ కనకాల,దేవయాని, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ సంస్థ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.