జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు సినిమాలు చేసేస్తున్నారు. తాను ఇక సినిమాల్లోకి రాను... సినిమాల మొఖం చూడనంటూనే ఇప్పుడు తిరిగి మళ్లీ మొఖానికి రంగేసుకున్నాడు. జనసేన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు పవన్కు రాజకీయం చేయడం.. రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమొ తెలిసొచ్చింది. ఇప్పుడు వెంటనే తన మాటపై యూటర్న్ తీసుకుని సినమాల్లో నటిస్తున్నాడు.
ఇక, పవన్ కొత్త సినిమా మే నెలలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ హిట్ సినిమా పింక్కు రీమేక్గా వస్తోన్న ఈ సినిమా వచ్చే మే నెలలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక పవన్ మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్లో విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాను ముందుగా వైసీపీ వాళ్లే ఎక్కువుగా టార్గెట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ట్రెండ్స్ చెపుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రీ లుక్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ‘ఎల్లో’ వుండడంతో.. దాన్ని తెలుగుదేశం పార్టీకి అన్వయించేస్తున్నారు.
ఇదొక్కటే కాదు పింక్ సినిమాలో పవన్కు హీరోయిన్లకు మధ్య ఘాటు లిప్ లాక్ సీన్స్ వుంటాయనీ, హీరోయిన్ల ఎక్స్పోజింగ్ వుంటుందనీ.. అడల్ట్ కంటెంట్కు అంతే ఉండదని కూడా కొన్ని రాతలు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. మరోపక్క, ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోనూ ఈ సినిమాకి ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా తెరపైకొస్తోంది.
అసలే ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా... ఇది అన్ని వర్గాలకు ఎక్కుతుందా ? అన్న డౌట్ ఉంది. మరి ఈ టైంలో రిలీజ్కు ముందే ఇన్ని వివాదాలు ముసురు కోవడంతో పవన్ ఈ యాంటీని ఎలా తట్టుకుని సినిమాను సక్సెస్ చేసుకుంటాడో ? చూడాలి. పవన్ నటించిన అజ్ఞాతవాసి లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ పరిశీలనలో ఉందట.