ఈ మధ్య టాలీవుడ్ లో కి ఇతర భాషల హీరోలు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోలు తమ సత్తా చాటుతున్నారు.  ప్రస్తుతం కన్నడ భాష నుంచి వచ్చిన హీరో యష్ కి తెలుగులో మంచి అభిమానులు ఉన్నారు. గతంలో కన్నడ నుంచి పలువురు హీరోలు, నటులు తెలుగు తెరకు సుపరిచితులే అందులో ఉపేంద్ర నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కే జి ఎఫ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యష్ ‘కేజీఎఫ్ 2’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  ఈ మూవీ కూడా ఆల్ ఇండియా మూవీ గా వస్తుంది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రాబోతుంది.

 

'చాఫ్టర్ 2' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  యష్ హీరోగా ప్రశాంత్ మీరు దర్శకత్వంలో తెరకెక్కిన దేశవ్యాప్తంగా దుమ్ము రేపింది. కన్నడ నాట యష్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ మద్య ఆయనపై హత్య ప్లాన్ చేసిన ఓ రౌడీ షీటర్ పోలీస్ ఎన్ కౌటంటర్ లో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. 

 

తాజాగా  హీరో యష్ కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు ను ఒక కోరిక కోరాడట  అదేంటంటే  బెంగుళూరులో ఓ పెద్ద ఫిల్మ్ సిటీ నిర్మించాలని యష్  కోరాడు.  కన్నడ చిత్ర సీమ ఇంత అభివృద్ధి చెందిన కొన్ని అవసరాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లాల్సివస్తుందని... ప్రస్తుతం హైదరాబాద్, ముంబాయి, తమిళనాట కొన్ని ఏరియాల్లో షూటింగ్ కోసం వెళ్లాల్సి వస్తుందని అయన అంటున్నారు.   బెంగుళూర్ లో ఒక ఫిలింసిటీ ఏర్పాటు చేయాలనీ యష్ కోరాడు . యష్ కోరికను సీఎం యడ్యూరప్ప పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: