దేవి శ్రీ ప్రసాద్... కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని ఏలిన సంగీత దర్శకుడు.. తెలుగు ప్రేక్షకులని తన వినసొంపైన బాణీలతో మైమరిపించిన మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ చేసే ఒకే ఒక్కడుగా పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ అనగానే దేవిశ్రీ ప్రసాద్ పేరే మొదటగా వినిపించేది. అయితే అంతటి ఘనత ఉన్న సంగీత దర్శకుడు కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

 

 

 

దేవి శ్రీ మ్యూజిక్ గతంలో లాగా మ్యాజిక్ కనబడట్లేదని, పాత ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ కొట్టి వదులుతున్నాడని, అందువల్ల అతని మ్యూజిక్ లో కొత్తదనం కనబడట్లేదని వాపోతున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన సరిలేరు నీకెవ్వరు పాటలు కూడా ఏమంతగా ఆకర్షించలేకపోయాయి. ఆ సినిమాకి పోటీగా వచ్చైన అల వైకుంఠపురములో పాటలు వైరల్ అవుతుంటే సరిలేరు పాటలు మాత్రం అభిమానుల వరకే పరిమితమయ్యాయి.

 

 

 


దాంతో దేవిశ్రీ పని అయిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కొత్త ట్యూన్లు చేసి తనని తాను నిరూపించుకోవాలని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దేవి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న "ఉప్పెన" సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా నుండి మొదటి పాట నేడు సాయంత్రం రిలీజ్ కాబోతుంది. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం" అంటూ సాగే ఈ పాట బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.

 

 

 


మరి ఈ సినిమాతోనైనా దేవిశ్రీ మీద ఉన్న అపవాదులు పూర్తిగా తొలగిపోతాయేమో చూడాలి. ఈ సినిమా మ్యూజిక్ హిట్ అయితే విమర్శకులకి సమాధానం చెప్పినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: