ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా దేవుడి ముందు అందరూ సమానమే. అందరూ కోరుకున్నట్టే సెలబ్రిటీలు కూడా తమ ఆశలు, కోరికలు నెరవేరాలని ఎంత భక్తిశ్రద్ధలతో దేవుళ్లను పూజిస్తారు. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన విచ్చేసి స్వామివారిని ఆశీస్సులు తీసుకుంటే ఎంతటి కోరికలైనా తీరుతాయి. గత సంవత్సరం దీపికా పడుకొనే రణ్ వీర్ సింగ్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవానికి తిరుపతిని దర్శించి తమ వివాహ బంధం లో కలతలు చింతలు లేకుండా కొనసాగాలని, తాము తీసే సినిమాలు హిట్టు కావాలని కోరుకున్నారు.

 

 

మరి ముంబై లో నివసించే అంతటి సెలబ్రిటీలే ఇక్కడికి వచ్చారంటే మన హైదరాబాద్లో నివసించే సెలబ్రెటీలు స్వామివారి ఆలయానికి రావడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపోతే నలుగురు హీరోయిన్లు అతి సామాన్యులుగా కాలినడకన తిరుమలకు వచ్చారు. మరి ఈ ఆసక్తికరమైన విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే... అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చిత్రంలో నటించిన కాస్ట్ అండ్ క్రూ కలసి సోమవారం పొద్దున ఏడుకొండలవాడిని దర్శించారు. తమ సినిమా మార్చి 6వ తారీఖున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వారు స్వామి వారి చెంతకు చేరుకుని తమ సినిమా భారీ హిట్ కావాలని కోరుకున్నారు. ఈ సినిమా ముఖ్యంగా గోవాలో చిక్కుకున్న నలుగురు అమ్మాయిలు ఎలా బయటపడగలుగుతారో అనే కథని కాస్త హాస్యభరితంగా, కాస్త త్రిల్లింగ్ గా చూపిస్తుంది. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన  పాత్రలలో నటించగా... వారు తిరుమల కి కాలి నడకన వచ్చి విఐపి బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.


ఇకపోతే మీడియాతో ముచ్చటించిన కోమలి ప్రసాద్ ఈ సినిమాని పాప్ కార్న్ తింటూ హాయిగా రెండు గంటలు నవ్వుకుంటూ చూడవచ్చని... తను ధన్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో నటించిందని అది ప్రయోగాత్మక పాత్ర అని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: