సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తర్వాత అసలైతే వంశీ పైడిపల్లి మూవీ చేస్తాడని అందరు ఊహించారు. అయితే వంశీ పైడిపల్లి చెప్పిన కథలో కొన్ని డౌట్లు ఉండటంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి లేటెస్ట్ గా పరశురాం డైరక్షన్ లో సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తారట. పరశురాం స్టోరీ లైన్ నచ్చడంతో మహేష్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మార్చి 25 తెలుగు సంవత్సరాధి రోజున ఈ సినిమా ముహుర్తం ఉంటుందని తెలుస్తుంది. మహేష్ సినిమా అంటే బజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. 

 

మహేష్ ఓకే చెప్పడంతో ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలుస్తుంది. ఆంజనేయులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై విజయ్ దేవరకొండ కెరియర్ లో గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పరశురాం కెరియర్ లో మొదటిసారి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత మహేష్ వంశీతో సినిమా చేయాలని అనుకున్నా ఫుల్ స్క్రిప్ట్ మహేష్ ను అంత సాటిస్ఫై చేయలేదని తెలుస్తుంది.  

 

అందుకే సడెన్ గా ఎక్కువ టైం తీసుకోకుండా మహేష్ పరశురాం సినిమాకు ఓకే చెప్పాడట. గీతా గోవిందం తర్వాత పరశురాం తన నెక్స్ట్ సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా పరశురాం కు మహేష్ ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హేగ్దే పేరు వినపడుతుంది. వరుస సినిమాలతో అమ్మడు సూపర్ ఫాం లో ఉంది. ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమాలో నటించిన పూజా హేగ్దే రెండో ఛాన్స్ కూడా పట్టేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: