ర‌కుల్ ప్రీత్‌సింగ్ మూడేళ్ల క్రితం వ‌ర‌కు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌. వ‌రుస పెట్టి స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా ఛాన్సులు కొట్టేసింది. అల్లు అర్జున్ తో స‌రైనోడు, ఎన్టీఆర్‌తో నాన్న‌కు ప్రేమ‌తో, మ‌హేష్‌బాబుతో స్పైడ‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో బ్రూస్ లీ, ధృవ సినిమాల్లో వ‌రుస పెట్టి న‌టించి హిట్లు కొట్టింది. ఆ త‌ర్వాత ఇక్క‌డ ఆమెకు వ‌రుస‌గా ఛాన్సులు రావ‌డం త‌గ్గిపోయాయి. బాలీవుడ్ వెళ్లి అక్క‌డ ల‌క్ ప‌రీక్షించుకున్నా ఫెయిల్ అయ్యింది. కోలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల్లో స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించినా అవ‌కాశాలు రాలేదు.



ఇక గ‌తేడాది సీనియ‌ర్ నాగార్జున ప‌క్క‌న ఆమె నటించిన మ‌న్మ‌థుడు 2 సినిమా ర‌కుల్ ప‌రువుతో పాటు నాగార్జున ప‌రువు కూడా తీసేసింది. ఇక తాజాగా ఆమె సౌత్ హీరోల గురించి చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. సౌత్ లో అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సౌత్ లో హీరోలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది అని.. వాళ్ళకి అధిక పారితోషకం ఉంటుంది అని చెపుతోంది. ఇక్క‌డ అవ‌కాశాలు ఉన్న‌న్ని రోజులు ఆమెను టాలీవుడ్ జ‌నాలు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ముంబైకి మ‌కాం మార్చి హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాలం గ‌డుపుతున్నావు. నువ్వు ఇప్పుడు సౌత్ హీరోల‌పై కామెంట్లు చేయ‌డం ఏంట‌మ్మా ? అని తెలుగు ప్రేక్ష‌కులు ఆమెను సోష‌ల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు.



అస‌లు ఇప్పుడు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా ?  నువ్వు కాంతి విహీనంగా మారిపోయావు ?  నీకు ఇక ఛాన్సులు రావు.. ఈ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు ఎందుకు ?  నీ ఓవ‌ర్ యాక్ష‌న్ ఆపు త‌ల్లో అని కూడా వాళ్లంతా ఫైర్ అవుతున్నారు. అయితే ర‌కుల్ కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు ఆమె ఎక్కువ డిమాండ్ చేసేద‌న్న టాక్ కూడా ఉంది. దీనిపై ఆమె మాట్లాడుతూ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ హీరోయిన్స్ కి కూడా కావాలని నేనెప్పుడూ డిమాండ్ చెయ్యలేదని చెప్ప‌డం గ‌మ‌నార్భం.

మరింత సమాచారం తెలుసుకోండి: