టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి సినిమా ద్వారా డైరెక్ట్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నయనతార, వాస్తవానికి అంతకముందు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన చంద్రముఖి సినిమాలో నటించింది. తెలుగులో కూడా ఆ సినిమా డబ్ అయి సూపర్ హిట్ కొట్టడంతో ఆపై ఆమెకు తమిళ్ లో బాగా అవకాశాలు పెరగడం, అనంతరం సూర్య సరసన నటించిన గజినీ కూడా హిట్ కావడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు కూడా ఆమెపై పడింది. అదే సమయంలో వివి వినాయక్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మితో డైరెక్ట్ గా తెలుగుకు ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఆ సినిమాతో కూడా హిట్ కొట్టి ఇక్కడ కూడా మంచి పేరు దక్కించుకుంది. 

 

ఇక ఆ తరువాత అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న నయనతార, కొన్నాళ్ల క్రితం నుండి మాత్రం తన పద్దతిలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో గ్లామరస్ దుస్తులు ధరించనని, అలానే ముఖ్యంగా రొమాంటిక్, శృంగార సన్నివేశాల్లో అసలు నటించేది లేదని, వాటితో పాటు సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్ కు వచ్చేది లేదని తెగేసి చెప్పేదట. ఆ విధంగానే ఇటీవల సూపర్ స్టార్ రజిని సరసన ఆమె నటించిన దర్బార్ వరకు కూడా దాదాపుగా ఒక్క సినిమాకు కూడా ఆమె ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళ నిర్మాతలు సైతం ఆమెపై కొంత గుర్రుగా ఉన్నట్లు టాక్. 

 

ఇకపోతే ఇటీవల ఒకప్పటితో పోలిస్తే ఆమెకు మెల్లగా అవకాశాలు తగ్గుతున్నాయని, యువ కథానాయికల రాక పెరగడంతో దర్శక, నిర్మాతలు కూడా ఆమెను తీసుకునేందకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దానితో కొంత దిగివచ్చిన నయన్, ఎట్టకేలకు తన పద్ధతి మార్చుకుని గ్లామరస్ రోల్స్ లో నటించేందుకు, అలానే ఇకపై తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు సిద్ధం అవుతోందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఆమెకు మళ్ళి మంచి అవకాశాలు దక్కడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: