ప్రస్తుతం అక్కినేని వారి వారసుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు యువత నుండి మంచి స్పందన లభించింది. ఇకపోతే నేడు ఈ సినిమా నుండి మనసా మనసా అనే పల్లవితో సాగె తొలి సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

యువ సంచలన గాయకుడూ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ కు గోపిసుందర్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోగా, శ్రీరామ్ ఈ సాంగ్ ని ఎంతో హృద్యంగా ఆలపించడం జరిగింది. ఇక ఇప్పటికే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాలో సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమనా సాంగ్ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం మనసా మనసా సాంగ్ కూడా దూసుకుపోతుండడం తో, మరికొద్దిరోజుల్లో దీనికి కూడా మరింత మంచి స్థాయిలో వ్యూస్ దక్కడం ఖాయం అని అంటున్నారు. 

 

మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాశ్ రెడ్డి, ప్రగతి, అమిత్ తివారి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ రోల్ యువతను ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. బొమ్మరిల్లు తరువాత భాస్కర్ ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య తీస్తున్న రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయని, ఇక సినిమాలో అంతర్లీనంగా సాగె ఎమోషన్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు. ఇక మొత్తంగా చూస్తే ఎప్పటినుండో ఎంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ని అందించేలా కనపడుతోందని సమాచారం. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపికపట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: