కియారా అద్వానీ.. అందానికి బ్రాండ్ అంబాసడర్ లా ఉంటది. అమ్మడు ని చూడగానే పక్కింటి అమ్మాయిలా అంత అమాయకత్వంగా ఉంటది. కానీ నటనలో మాత్రం చాల అద్భుతం గా నటిస్తుంది. బాలీవుడ్ నుచి వచ్చిన ఈ పాప తెలుగులో  కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన జోడి కట్టింది. ఈ సినిమాలో ఈమె నటన చూసి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ భావించారు.

 

కియారా ఎంట్రీ స్టార్ హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అంతేకాకుండా ఈ సినిమా బాక్సఫీస్ వద్ద కానుకల వర్షం కురిపించింది. అంతే ఇంకా ఈ అమ్మడు కి తిరుగులేదు అనుకున్నారు అందరూ అనుకున్నట్లే రెండో సినిమా మెగాపవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. రాంచరణ్ మూవీ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది, దాంతో పాప ఆశలు అన్ని గల్లంతు అయ్యాయి. దీనితో చేసేది ఏమిలేక టాలీవుడ్ కి టాటా చెప్పి మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

 

కియారా అద్వానీ అదృష్టం వెంటాడుకుంటూ వచ్చింది అనే చెప్పాలి, ఎందుకు అంటే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో  అర్జునరెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ రీమేక్ చేసారు. అందులో కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో ఈమె చేసిన ప్రీతీ పాత్రకు ప్రాణం పోసింది. సినిమా కూడా బాలీవుడ్ బాక్సఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇంతవరకు బాగానే ఉన్న పాప చేతిలో హిట్ సినిమాలు ఉన్న దర్శక, నిర్మాతలు పటించుకోవడం లేదు. పాప కాస్త రూట్ మార్చి ఫోటో షూట్స్ కుర్రకారు మతులు పోగొడుతుంది. రీసెంట్ గా వచ్చిన ఆకు చాటు ఫోటో అయితే సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపింది. ఆ ఫోటో పై నెటిజన్స్ యుద్ధమే చేసారు పాపం కియారా ఎదో అవకాశం కోసం చేస్తే ఇలా విమర్శలు మూటకొట్టుకుంది. పాప కి ఇప్పుడు అయినా మంచి అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: