టాలీవుడ్ లో ఎంతో మంది వ్యాంప్ పాత్రల్లో నటించారు.  ఒకప్పుడు వ్యాంప్ పాత్రల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, విజయలలిత ఇలా మరికొంత మంది పేర్లు వినిపించేవి.  ఆ మద్య వ్యాంప్ పాత్రల్లో నటి రమ్యశ్రీ పేరు మారుమోగింది.  ఓ మల్లి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.  అగ్ర హీరోయిన్లు అర్ధనగ్నంగా నటిస్తున్నపుడు తాను సెమీ న్యూడ్‌గా నటిస్తే తప్పేంటని నటి రమ్యశ్రీ ప్రశ్నించారు. తాను యుక్త వయస్సులో ఉండగానే బ్లూ ఫిలింలలో నటించే అవకాశం వచ్చిందని కానీ నేను వెళ్లలేదని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐటం గర్ల్‌గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఎక్కడా క్లిక్ కాలేకపోయింది. దీంతో రూటు మార్చి నగ్న అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఆంటీగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.  

 

ఆ మద్య హాట్ ఫోటో షూట్స్ తో దుమ్మురేపింది. సెక్సీ ఆంటీ పాత్రలు చేస్తూ వివిధ భాషా మూవీస్ అవకాశాలు దక్కించుకున్న రమ్యశ్రీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమ్యశ్రీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడింది. తాను నేను పుట్టి పెరిగింది వైజాగ్ లో. మొదటి నుంచి కూడా సినిమాల పిచ్చి ఎక్కువగానే ఉండేది. అయితే సినిమాకి కూడా మా ఇంట్లో వాళ్లు నన్ను ఒంటరిగా పంపించేవారు కాదు. అప్పట్లో మా ఇంటికి హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చారు.. ఎవరికీ తెలియకుండా వారి నెంబర్ తీసుకున్నాను. 

 

ఆరు నెలల తరువాత ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కి వెళ్లిపోయాను.  ఆ సమయంలో నాకు అంతా కొత్త కొత్తగా ఉండేది.. కానీ నా స్నేహితురాలు బాగా సహాయం చేసింది.  నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చినపుడు నా వయసు 18 సంవత్సరాలు... సినిమా అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డానని అన్నారు.  మొత్తానికి నేను అనుకున్నది సాధించా... ఏడు భాషల్లో వివిధ రకాల పాత్రలను పోషించాను. దాదాపు అందరు కమెడియన్స్ తో కలిసి నటించాను చెప్పింది రమ్యశ్రీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: