టాలీవుడ్ లో ఉన్న ఏ స్టార్ ప్రొడ్యూసర్ అయినా సరే ఒక్క సినిమా అయినా పవన్ కల్యాణ్ తో నిర్మించాలని అనుకుంటారు. అంతేకాదు టాలెంట్ ఉన్న చిన్న దర్శకుల దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ప్రతీ ఒక్కరు పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆయన కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక స్టార్ ప్రొడూసర్స్ కూడా పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మించాలనుకునేది కోట్లు సంపాదించడానికి కాదు కల నెరవేర్చుకోవడానికి. ఇప్పుడు దిల్ రాజు ఆ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. ఇక దిల్ రాజుకి ఉన్న మార్కెట్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అసాధారణం. ఆయన బ్యానర్ నుండి ఒక సినిమా వస్తుందంటే ఆ ఆతృత వేరు.

 

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలో హీరో ఎవరనేది చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకి వస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇప్పటి వరకు చాలా సినిమాలు నిర్మించారు. ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో కూడా సినిమాల్ని నిర్మించి సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరుని దక్కించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్నది ఆయనకి కొన్నేళ్ళుగా ఉన్న కల. ఇప్పుడు 'వకీల్ సాబ్' తో ఆ కల కూడా నెరవేరుతుంది. 

 

అయితే ప్రతీ నిర్మాతకి ఏదో ఒక కల ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా బాగా కొనసాగుతోంది. బాహుబలి సినిమా నుండి మన టాలీవుడ్ లో ఈ పిచ్చి బాగా మొదలైంది. ప్రతీ నిర్మాత తన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని ఆరాటపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత దిల్ రాజు కోరిక పాన్ ఇండియా సినిమానే అని అనుకుంటున్నారు. కాని అది సాధ్యపడదని క్లియర్ గా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో రిలీజై సూపర్ హిట్ అయింది. కాబట్టి వకీల్ సాబ్ ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం వేస్టే అని చెప్పాలి. ఇక ఇప్పుడు దిల్ రాజు కి ఉన్న పెద్ద కోరిక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాని నిర్మించాలని. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: