అక్కినేని నాగచైతన్య .. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో. జోష్ సినిమాతో దిల్ రాజు నాగ చైతన్య ని పరిచయం చేసినప్పటికి ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. కానీ చైతూ మాత్రం హీరోగా బాగానే సెటిలయ్యాడు. అయితే దిల్ రాజు బ్యానర్ లో మాత్రం మళ్ళీ సినిమా నిర్మించలేదు. మధ్యలో రెండు మూడు సార్లు ప్రయత్నించినప్పటికి ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ దిల్ రాజు-నాగ చైతన్య కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది. అంతేకాదు డైరెక్టర్ కూడా వేణు శ్రీరాం అని, సుధీర్ వర్మ అని, చందు మొండేటి అని ఇలా అయిదారు మంది డైరెక్టర్స్ పేర్లు జోరుగా ప్రచారం జరిగాయి. అయితే ఫైనల్ గా మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ని దిల్ రాజు చైతూ తో నిర్మించబోయో సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. 

 

విక్రమ్ కె కుమార్ అంటే మంచి క్రియోటివ్ డైరెక్టర్ అన్న పేరున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమాని ఇచ్చి ఆ ఫ్యామిలీకి ఎప్పటికి గుర్తుండిపోయో సినిమాని ఇచ్చాడు. అందుకే విక్రమ్ కుమార్ అంటే అక్కినేని హీరోలతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కు కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం. అంతేకాదు విక్రమ్ కె కుమార్ మీద మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మనం సినిమాతో బాగా అభిమానం ఏర్పడింది. ఇక కోలీవుడ్ లో స్టార్ హీరో 24 సినిమా కూడా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. కమర్షియల్ గా సక్సస్ కానప్పటికి దర్శకుడిగా విక్రమ్ కె కుమార్ మంచి పేరుని సంపాదించుకున్నాడు. 

 

అయితే ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ అఖిల్ తో తీసిన హలో నేచురల్ స్టార్ నానీ తో తీసిన గ్యాంగ్ లీడర్ ఫ్లాపయ్యాయి. అయినా కూడా దిల్ రాజు విక్రమ్ కె కుమార్ మీద నమ్మకంతో చైతూ సినిమాకి ఆఫర్ ఇచ్చాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘లవ్ స్టోరీ’ సినిమా ను చైతూ చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు చైతూ సినిమా ఉంటుందని అంటున్నారు. కానీ ఈ నిర్ణయం సరైనది కాదని దిల్ రాజుకి కొంతమంది సలహ ఇస్తున్నారట. వరుస ఫ్లాపులతో ఉన్న విక్రమ్ కె కుమార్ కి సినిమా ఇవ్వడం పిచ్చి పని అంటున్నారట. మరి దిల్ రాజు ఫైనల్ గా ఎలా డిసైడ్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: