అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడేళ్ళవుతోంది. ఇప్పటికీ మూడు సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఒక్క సినిమా కూడా పరవాలేదులే ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ని తెచ్చుకోలేకపోయింది. ఇంత హ్యాడ్సం గా ఉన్న అఖిల్ నుండి జనరల్ గా యూత్ మంచి లవ్ స్టోరి తో వెరైటీ సినిమాని కోరుకుంటారు. కాని అది ఇప్పటి వరకు అఖిల్ ఇవ్వలేదు. ప్రతీ సినిమా హిట్ అనుకున్నప్పటికి అది భారీ ఫ్లాప్ గా మిగులుతుంది. అయినా హీరోగా నిలదొక్కుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఇక తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డేతో అఖిల్ నటిస్తున్నాడు. జీఎ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

 

ఇక ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి 'మనసా మనసా' అన్న లిరికల్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేసిన ఈ సాంగ్ గ్యారెంటీగా హిట్ అని అంటున్నారు. ముఖ్యంగా సింగర్ సిద్ శ్రీరాం సామజవరగనమ సాంగ్ తర్వాత మళ్ళీ అలాంటి సూపర్ హిట్ సాంగ్ ని పాడాడని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

 

ఇదిలా ఉంటే నాగార్జున మాత్రం అఖిల్ విషయంలో బాగా టెన్షన్ పడుతున్నారట. ఎలాగోలాగా నాగ చైతన్య హీరోగా నిలదొక్కుకున్నాడు. మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని సెటిలయ్యాడు. సొంతగా కథలని సెలెక్ట్ చేసుకొని సొంత నిర్ణయాలతో సాగుతున్న చైతన్య కెరీర్ కి ప్రస్తుతానికైతే ఢోకా లేదు. సో చైతన్య విషయంలో నాగార్జున కి ఎలాంటి టెన్షన్ లేదు. కాని అఖిల్ విషయంలో మాత్రం బాగా టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే మూడు ఫ్లాపులు పడ్డాయి. ఈ సారి కూడా రిజల్ట్ తేడా కొడితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారట నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: