కెరటం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకుని స్టార్ ఛాన్సులు పట్టింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ బ్రూస్ లీ తో మొదలైన రకుల్ స్టార్ సినిమాల హవా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. చరణ్, తారక్, అల్లు అర్జున్, మహేష్ ఇలా స్టార్స్ అందరితో నటించింది రకుల్. అయితే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాకే తమిళ, హింది భాషల్లో కూడా మంచి అవకాశాలు తెచ్చుకుంది. తనకు ఇంత మంచి కెరియర్ ఇచ్చిన టాలీవుడ్ పైనే సంచలన వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.   

 

ఇంతకీ రకుల్ ఏమన్నది అంటే.. టాలీవుడ్ లో టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం బాగుంటుంది కాని ఒక హీరోయిన్ అందరి హీరోలతో నటించిన తర్వాత మళ్లీ ఆమెను సెకండ్ టైం తీసుకునేందుకు నిరాకరిస్తారని అన్నది. కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తే పాత హీరోయిన్స్ కు ఛాన్సులు ఉండవని.. వాడుకున్నంత వాడుకుని ఆ తర్వాత ఛాన్సులు ఇవ్వరని అంటుంది రకుల్. అంతేకాదు హీరోకి తగినట్టుగా హీరోయిన్స్ కూడా కష్టపడుతున్నా రెమ్యునరేషన్ తో పాటుగా హిట్ క్రెడిట్ మొత్తం హీరోలే మోసేస్తారని అంటుంది. రకుల్ పాప కామెంట్స్ విన్న కొందరు మాత్రం తెలుగులో అవకాశాలు రావట్లేదన్న ఫ్రెస్ట్రేషన్ లో ఇలా మాట్లాడేస్తుందని అంటున్నారు.

 

ఈమధ్య ఓ సిని వారసుడితో డేటింగ్ గట్రా చేస్తుందన్న వార్తలతో తలబొప్పి కట్టినట్టుంది అందుకే ఈమధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండట్లేదు. అంతకుముందు హైదరాబాద్ లో ఉన్న సొంత ఇంటిని సైతం అమ్మేసినట్టు టాక్. ఏది ఏమైనా టాలీవుడ్ లో రకుల్ డౌన్ ఫాల్ ఊహించలేదు. అందుకే కొద్దిగా అసంతృప్తిగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: