చిరంజీవి కొరటాల మూవీ ‘ఆచార్య’ లో మొదట్లో రామ్ చరణ్ కోసం క్రియేట్ చేసిన ప్రత్యేక పాత్రను ఇప్పుడు మహేష్ చేత చేయించే విషయం ఇంచుమించు ఖరారు అయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఫంక్షన్ లో మహేష్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రను చేస్తున్న విషయాన్నీ కొరటాల అధికారికంగా ప్రకటించే ఆలోచనలు చేస్తున్నారు. 


ఇప్పటికే ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడంతో ఈ విషయమై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో రామ్ చరణ్ ను నటించే పరిస్థితులు లేనప్పుడు ఆ పాత్రను మహేష్ కు ఆఫర్ చేసేకన్నా పవన్ కళ్యాణ్ చేత ఆ ప్రత్యేక పాత్రలో నటింప చేస్తే మరింత క్రేజ్ ఆ మూవీ ప్రాజెక్ట్ కు ఏర్పడి మరింత భారీ స్థాయిలో కలక్షన్స్ వస్తాయి కదా అన్న అభిప్రాయాలను పవన్ అభిమానులు వ్యక్త పరుస్తున్నారు.


అంతేకాదు కొంతమంది పవన్ అభిమానులు అయితే ఈ సూచనను కొరటాల చిరంజీవి లకు చేరవేసే ప్రయత్నాలు కూడ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవి గతంలో నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీలో పవన్ కొద్ది క్షణాలపాటు అతిథి పాత్రలో కనిపించి మెగా అభిమానులకు జోష్ ను కలిగించాడు. ఆ తరువాత చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళి పోవడంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు ఒకే సినిమాలో కనిపించాలి అన్న మెగా అభిమానుల కోరిక తీరలేదు. 


రాజకీయాల బాట పట్టి తిరిగి మళ్ళీ సినిమాల వైపు యూటర్న్ తీసుకుని ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న పవన్ చేత ‘ఆచార్య’ మూవీలో మహేష్ కు బదులు పవన్ కనిపిస్తే బాగుండును అన్న కోరిక మెగా అభిమానులలో చాల గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది, ఆ మధ్య సుబ్బిరామిరెడ్డి పవన్ కళ్యాణ్ చిరంజీవిలతో ఒక సినిమా చేయాలని చాల గట్టిగా ప్రయత్నించి తియ్యలేక పోయారు. దీనితో ప్రస్తుతం పవన్ అభిమానులలో చాల ప్రబలంగా ఉన్న ఈ సున్నిత అంశాన్ని పరిగణలోకి తీసుకుని కొరటాల పవన్ అభిమానుల కోరక తీరుస్తాడా లేదంటే తన యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా చిరంజీవి మహేష్ లతో మరికొద్ది రోజులలో తేలిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: