ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతున్నాయి.  పాజిటీవ్ కానీ.. నెగిటీవ్ సెకన్లలో వైరల్ అవుతున్నాయి. ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అంతే కాదు హద్దు మీరు హత్యలు కూడా చేస్తున్నారు.  ఒక అమ్మాయి ఇంటి నుంచి బయలకు వెళ్లాలంటే ఆమె తిరిగి ఇంటికి వచ్చే వరకు అటు అమ్మాయిలు ఇటు తల్లిదండ్రులకు భయం భయంగా ఉంటున్నారు.  ఈ మద్య సెలబ్రెటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు.  నిన్న రాహు’ హీరోయిన్ ఫోన్ నంబర్ సోమవారం ఉదయం నుంచి కలవడం లేదని ఆ చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల చెప్పారు.

 

ఆమెను అజ్ఞాత వ్యక్తి మోసం చేసి ముంబైకి రప్పించకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయాలి అని రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ ను ముంబై కి రమ్మన్నడు ఓ అజ్ఞాతవ్యక్తి. అయితే అది నిజామా కదా అని తెలుసుకోకుండానే ముంబై కి వెళ్ళింది హీరోయిన్... అయితే ఈ రోజు పొద్దున నుండి హీరోయిన్ నంబర్ కలవడం లేదు కంగారుపడుతున్నారు తన కుటుంబసభ్యులు.  టాలీవుడ్ లో రాహు అనే చిత్రంలో నటించిన కృతి గార్గ్ కనిపించడం లేదంటూ చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల పోలీసులను ఆశ్రయించడం తీవ్ర కలకలం రేపింది.  అయితే ఈ విషయం పై నిన్న నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. 

 

అసలు ఈ హీరోయిన్ ఉందా లేదా అన్న అనుమానాలు కూాడా రేకెత్తించాయి.  ఇలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  తాజాగా  తన ఆచూకీ దొరకడంలేదంటూ మీడియాలో వస్తున్న కథనాలపై హీరోయిన్ కృతి గార్గ్ ఫేస్ బుక్ లో స్పందించింది. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ముంబయిలో తన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నానని వెల్లడించింది. నెట్ వర్క్ లేని కారణంగా ఫోన్ పనిచేయకపోవడంతో డైరెక్టర్ సుబ్బు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటాడని వివరణ ఇచ్చింది.  తన వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమాపణలు కోరింది.. అలాగే తనపట్ల ఇంతటి శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: