సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి వంటి సినిమా తీసి సూపర్ హిట్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన తర్వాతి చిత్రాన్ని కూడా మహేష్ తోనే తీద్దామని ప్లాన్ చేసాడు. మహర్షి టైమ్ లో వీరిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఎవరితో ఎక్కువగా కలవని మహేష్ వంశీతో చాలా క్లోజ్ గా కనిపించాడు. మహేష్ వంశీలే కాదు నమ్రత, వంశీ భార్య కుడా మంచి స్నేహంగా కనిపించారు.

 

 

దాంతో ఫ్యామిలో ఫ్రెండ్స్ అయ్యారని అందరూ అనుకున్నారు. అది నిజం కూడా.. అయితే సడెన్ గా వంశీతీ మహేష్ సినిమా ఆగిపోయిందని వార్త వచ్చింది. ఈ వార్తలు చాలా అనుమానాలనే రేపాయి. ఇన్ని రోజులుగా చేసిన స్నేహం అంతా ఉత్తదేనా.. మహేష్ ఇలా చేస్తాడని అనుకోలేదు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం మహేష్ వంశీల స్నేహం చెడిపోలేదని తెలుస్తుంది.

 

 

 

తాజాగా జయసుధ కుమారుడి వివాహా రిసెప్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్ కి ఫ్యామిలీతో సహా వచ్చిన వంశీ మహేష్ ఫ్యామిలీతో చాల స్నేహంగా కనిపించాడు. వంశీ భార్య కూడా నమ్రతతో చాలా దగ్గరగా ఉన్నట్టు.. వాళ్ల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనట్లే మెలిగింది. దీంతో అప్పటి వరకు మహేష్ వంశీ ల మధ్య ఉన్న స్నేహం అలాగే ఉందని అర్థం అవుతుంది.

 

 

కేవలం సినిమా పరంగా తామిద్దరికీ తేడా వచ్చిందని, అంతే తప్ప దానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం మాత్రం అలాగే ఉందని తెలుస్తుంది.  సినిమా అనేది కోట్లతో కూడుకున్న వ్యాపారం. అక్కడ కొంచెం కఠినంగా ఉండడం సహజమని అంతేకానీ అంతకుమించి వారిద్దరి దోస్తీలో ఎలాంటి గ్యాప్ రాలేదని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: