తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజ రవితేజ ఈ మద్య వరుస డిజాస్టర్స్ తో సతమతమవుడున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత వరుస డిజాస్టర్స్ రావడంతో రవితేజ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఆ మద్య వెరైటీ కాన్సెప్ట్ తో డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో డబుల్ రోల్ లో కనిపించినా ప్రేక్షకులు మాత్రం ఆదరించలేకపోయారు. దాంతోఈసారి మంచి హిట్ కొట్టకుంటే ఆయన కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడేట్టు ఉందని భావిస్తున్నారు రవితేజ. ఈ నేపథ్యంలో గతంలో తనకు బలుపు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపిచంద్ మలినేని తో క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్రం వాస్తవిక ఆధారాలతో చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికీ ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. పోలీస్ పాత్రలు రవితేజ కు కొత్తేం కాదు.. గతంలో రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు, బాబీ దర్శకత్వంలో పవర్ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు గోపిచంద్ మలినేని తో ‘క్రాక్’ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో బలుపులో నటించిన హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. తదుపరి చిత్రాన్ని ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఈ చిత్రం 1980 నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం.
కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ వుంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ మద్య పిరియాడికల్ చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత నటించిన రంగస్థలం 1983 నేటివిటికి తగ్గట్టుగా తీశారు. ఇక త్రినాథరావు 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు.అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ చిత్రం ఉంటుందని అంటున్నారు.