క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా ఎదిగిన నటుడు సందీప్‌ కిషన్‌. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో హీరోగా సక్సెస్‌ అయిన సందీప్‌, తమిళ్‌లోనూ మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవల నిర్మాతగానూ మారిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరోసినిమా వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 

సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావు తెరకు పరిచయం అవుతున్న సినిమా ఓ పిట్ట కథ. ఈ సినిమాలో విశ్వంత్‌ దుద్దుంపూడి, నిత్యా శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆనంద్‌ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమకు చందు ముద్దు దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్మించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

అయితే ఇదే వేడుకలో పాల్గొన్న సందీప్‌, మెగాస్టార్‌ తో కలిసి వేదిక పంచుకోవటంపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఓ పిట్ట కథ వేడకలో తను చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందీప్‌, `మెగాస్టార్‌ నవ్వుతూ పేరు పెట్టి పిలిచి తన పక్కన కూర్చోమనటం.. ఆ ఫీలింగే వేరు అంటు ట్వీట్ చేశాడు సందీప్‌ కిషన్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

That feeling when megastar Garu calls you by your name with a smile on his face and asks you to sit next to him ❤️ #opittakatha

A post shared by sundeep kishan (@sundeepkishan) on

మరింత సమాచారం తెలుసుకోండి: