అవకాశం కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లకు ఆలసించిన ఆశాభంగం. రండి బాబూ రండి...వచ్చి కథలు చెప్పుకోండి. రెండు నెలలు. ఇంకా రెండునెలలు మాత్రమే ఈ ఆఫర్. మహేష్ తో సినిమా చేద్దామని అనుకుంటున్న దర్శకులకు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు మహేష్.

 

సూపర్ స్టార్ మాంచి స్పీడు మీదున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వకుముందే మరో సినిమాని ఫైనల్ చేసేస్తున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడుని చూపిస్తున్న మహేష్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. అందుకే ఇదే మంచి టైమ్ అనుకుని  డైరెక్టర్లు మహేష్ కి కథలు చెప్పడానికి రెడీ అవుతున్నారు.   మహర్షి సినిమా కంప్లీట్ అవ్వగానే  వెంటనే అనిల్ రావిపూడితో సరిలేరునీకెవ్వరు సినిమా స్టార్ట్ చేసిన మహేష్..  జనవరి 12 న రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ..మహేష్ బాబు ఏకంగా 3 నెలలు షూట్ బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ కి వెళ్లొచ్చిన మహేష్ బాబు ఇప్పుడు డైరెక్టర్లకి సూపర్ ఆఫర్ ఇచ్చాడు. 

 

చిరంజీవి తో  షూటింగ్ స్టార్ట్ అయ్యే  సినిమాకి ఇంకా రెండు నెలలు టైముంది.  ఖాళీగా ఉండడం ఎందుకని మహేష్ కథలు వింటున్నాడట. అంతకుముందు మహేష్ తో సినిమా చేద్దామనుకున్న డైరెక్టర్లందరూ సూపర్ స్టార్ కి స్టోరీలు చెప్తున్నారు. ఎప్పటినుంచో మహేష్ తో సినిమా కోసం ట్రై చేస్తున్న పరశురామ్ కూడా ఈ మద్య మహేష్ ని కలిశాడు.  . గీతగోవిందం తర్వాత మహేష్ బాబుకు కూడా స్టోరీ వినిపించిన  పరశురామ్ కు  మహేష్ సెకండాఫ్ లో చేంజెస్ చెయ్యమని చెప్పాడు. మరి  ఈ సినిమా ఎంతవరకూ ప్రోగ్రెస్ అవుతుందో చూడాలి. 

 

మహేష్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రశాంత్ నీల్  కూడా మహేష్ కు కలుస్తున్నాడని టాక్. చర్చల దశలో ఉన్న ఈ కాంబినేషన్ కూడా సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. వీళ్లతో పాటు క్రిష్, మారుతి కూడా తమ కాంబినేషన్ లో సినిమా కోసం కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖాళీగా ఉన్నాడు కథలు వింటున్నాడు కాబట్టి.. మహేష్ తో సినిమా చేద్దామనుకుంటున్న డైరెక్టర్లకు ఇదే మంచి అవకాశం. మళ్లీ రెండు నెలలు దాటిలో వంశీతో చేస్తున్న సినిమాతో మహేష్ బిజీగా అయిపోవడం గ్యారంటీ. సో..డైరెక్టర్లూ..ఆఫర్ అందిపుచ్చుకోండి..సూపర్ స్టార్ కు స్టోరీలు చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: