తాప్సి పన్ను.. సొట్ట బుగ్గల సుందరి. ఈ భామ ఢిల్లీ నుంచి దిగుమతి అయిన బంగారం. తన నవ్వుతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు తన అందంతో, అభినయం తో కుర్రకారు మనసులనుదోచేసింది, అంత అద్భుతం గా తన నటన ను వెండితెరపై వలకపొసింది. టాలీవుడ్ లో ఈమెకి అంటూ ప్రత్యేకస్థానం ఏర్పర్చుకుంది. ఈ సొట్ట బుగ్గల సుందరి టాలీవుడ్ కి ఎలా పరిచయం అయింది అంటే. తాప్సి టాలీవుడ్ టాప్ డైరెక్టర్  కే.రాఘవేంద్రరావు  దర్శకత్వంలో  ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచమైంది.

 

ఈ సినిమాలో మంచు మనోజ్ పక్కన ఆడిపాడింది. ఇందులో ఈమె చేసిన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. మొదటి సినిమాలోనే తాను ఏంటో నిరూపించుకుంది. ముఖ్యంగా ఏం సక్కగా ఉన్నవారో నా సొట్ట సెంపలోడా అనే పాటలో ఈమె చేసిన యాక్టింగ్, తాను చూపించిన హావభావాలుకి. కుర్రకారు కి పిచ్చేక్కిపోయింది అంటే ఆశ్చర్యం లేదు. అంత బాగా నటించింది. అంతే కాకుండా ప్రభాస్ తో నడిచిన మిస్టర్.పర్ఫెక్ట్ అనే సినిమాలో ఈమె చేసిన ఆటిట్యూడ్ పాత్రకి అందరూ ముగ్దులయ్యారు .

 

అంత బాగానే ఉన్న కానీ టాలీవుడ్ ఈ భామని నిర్లక్ష్యం చేసింది అనే చెప్పుకోవాలి. దానితో ఆమె టాలీవుడ్ కాదు అనుకోని బాలీవుడ్ కి వెళ్ళింది. పాప బాలీవుడ్ కి వెళ్ళగానే అదృష్టం  నక్క తోక తొక్కినట్లు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. పింక్ అనే సినిమాలో అమితాబ్ తో పాటు పోటా పోటీ గా నటించింది. ఇందులో ఈమె చేసిన యాక్టింగ్ కి బాలీవుడ్ ఫిదా అయింది. ఈమె కోసం ఏ కథలు రాసుకోవడం మొదలు పెట్టారు. వరుస ఆఫర్లు తో ఈ ఢిల్లీ అమ్మడు బాలీవుడ్ లో బిజీ బిజీ గా గడుపుతుంది. ఇప్పటికైనా టాలీవుడ్ అందమైన అమ్మాయిలను కాదు అభినయం ఉన్న వాళ్ళని తీసుకుంటే మంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: