శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి.  ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవికి తెలుగులో వరుసగా ఛాన్సులు వచ్చాయి. కానీ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ అమ్మడు.  ఒకప్పుడు తన డ్యాన్స్ తో తెలుగు బుల్లితెరపై ఆకట్టుకున్న సాయి పల్లవి హీరోయిన్ గా మంచి విజయాలు అందుకుంటుంది.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తుంది.  అప్పట్లో శర్వానంద్ తో కలిసి సాయి పల్లవి 'పడి పడి లేచే మనసు' మూవీలో నటించింది.  మ్యూజికల్ హిట్ అయినప్పటికీ కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయింది. 

 

ఈ మూవీతో నిర్మాత చాలా నష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని తన రెమ్యూనరేసన్ కొంత తిరిగి ఇచ్చేసి తన మంచితనాన్ని చాటుకుంది సాయిపల్లవి.  'పడి పడి లేచే మనసు' తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. దాంతో మరోసారి తెరపై ఈ జంట కనిపిస్తారా అన్న అనుమానాలు వచ్చాయి.  అంతే కాదు శర్వానంద్ కి ఈ మద్య ఏదీ కలిసి రావడం లేదనే చెప్పాలి.  అలాంటపుడు కొంత మంది హీరోయిన్లు  ఈ హీరోని రిజక్ట్ చేస్తున్నట్లు టాక్.  అయితే సాయి పల్లవి మాత్రం శర్వానంద్ కి ఓ మూవీకి ఓకే చెప్పిందట. 

 

దర్శకుడు కిషోర్ తిరుమల ఈ ఇద్దరికీ ఒక ప్రేమకథను వినిపించాడట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు.  ప్రస్తుతం కిషోర్ తిరుమల హీరో రామ్ తో ‘రెడ్’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.  డబుల్ రోల్ లో రామ్ దుమ్మురేపాడని అంటున్నారు ఫ్యాన్స్.  ఆ సినిమా విడుదల తరువాత, శర్వానంద్ ను .. సాయిపల్లవిని సెట్స్ పైకి తీసుకెళతాడని అంటున్నారు. రెండోసారైనా ఈ జంట సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: