వరలక్ష్మి శరత్ కుమార్... ఈ అమ్మడు తమిళంలో ఎన్నో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. వరుస సినిమాలు చేసుకుంటూ... శరత్ కుమార్ నట వారసురాలిగా తమిళ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది ఈ అమ్మడు . అయితే నటనలో ఈ అమ్మడికి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే నటన లో క్రేజ్ వున్నట్టే... వివాదాల్లో కూడా ఈ అమ్మడికి బాగానే క్రేజ్ ఉంది. ఇంతకీ వివాదాలు ఎందుకు అంటే... వరలక్ష్మి ఎప్పుడు ముక్కు సూటిగా మాట్లాడేస్తూ ఉంటుంది. మనసులో ఏమి పెట్టుకోకుండా అనిపించింది మాట్లాడేస్తూ ఉంటుంది. అందుకే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ అమ్మడిని విమర్శించే వాళ్ళు కూడా చాలా ఎక్కువమంది ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా వెల్వెట్ నగరం అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మొత్తం ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రచారంలో భాగంగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఈ సినిమా దర్శకుడు మనోజ్ కుమార్ నటరాజన్ తో పాటు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వరలక్ష్మి శరత్ కుమార్.తన తండ్రి శరత్ కుమార్ రెండో భార్య అయిన రాధిక కుమార్తె రేయాన్ మిథున్ ప్రస్తావన ఇంటర్వ్యూలో రావడంతో.. రేయాన్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేయాన్ చాలా ధైర్యవంతురాలు తన సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉన్న అమ్మాయి అని సమాధానం ఇచ్చింది వరలక్ష్మి.
ఇదే సమయంలో రాధికను మీరు ఆంటీ అని పిలుస్తారట ఎందుకు అని ప్రశ్నించగా.. రాధిక నాకు అమ్మ కాదు... నా తండ్రికి రెండో భార్య అని అందుకే ఆంటీ అని పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఎవరికైనా ఒక్కరే అమ్మ ఉంటుంది కాబట్టి రాధిక ఆంటీ మాత్రమే అంటూ తెలిపింది. నా తండ్రి ని ఎంతగా గౌరవిస్తానో రాధికను కూడా అంతగానే గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. వాళ్ళిద్దరికీ వ్యతిరేకంగా తాను ఏమీ చేయను అంటూ చెప్పుకొచ్చింది. రేయాన్ కూడా అంతే అంటూ తెలిపింది.