టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఆ సినిమాకు ఆయన ఫాన్స్ చేసే హడావుడి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాను ప్రేక్షకులు చూడటం కంటే ముందు రోజే పవన్ కళ్యాణ్ అభిమానులే చూస్తూ ఉంటారు. వాళ్లకు మినహా ఎవరికి టికెట్ దొరికే అవకాశం ఉండదు. బాలీవుడ్ కూడా పవన్ సినిమాపై ఒక లుక్ వేసి ఉంచుతుంది అనే మాట అక్షరాలా నిజం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకి త్వరలో వస్తుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలని నిర్మాత రత్నం భావిస్తున్నారు. వాస్తవానికి అప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా రానుంది. జనవరి 8 న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. ఈ ఏడాది దసరాకే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

దీనితో ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనున్నాయి. ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద సందడి సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ రెండు పెద్ద సినిమాలే కావడంతో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది అనే అంచనాలు కూడా ఉంటాయి. నందమూరి మెగా ఫ్యామిలీ సినిమాలే రెండు. ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఉంటాయో అనేది చూడాలి. కాగా ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: