టాలీవుడ్లో సినిమాలు చేసి స్టార్ హీరోల ప‌క్క‌న హీరోయిన్లుగా న‌టించిన వారు వైరాగ్యంతో ఇండ‌స్ట్రీకి దూర‌మ‌వుతుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇప్ప‌టికే గ‌తంలో చాలా మంది హీరోయిన్లు ఛాన్సులు లేకో లేదా కొన్ని విష‌యాల్లో రాజీ ప‌డ‌లేకో సినిమాల‌కు దూర‌మ‌య్యారు. వీరిలో కొంద‌రు తెలుగు సినిమాపై ఆరోప‌ణ‌లు చేసిన వారు కూడా ఉన్నారు. రాధికా ఆఫ్టే, గ‌తంలోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ లాంటి వాళ్లు సైతం ఇండ‌స్ట్రీపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇక్క‌డ అవ‌కాశాల కోసం చాలా రాజీ ప‌డాల‌ని చెప్పారు. క‌స్తూరి లాంటి హీరోయిన్లు కూడా ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు.



ఇక మ‌రికొంద‌రు అందం, అభిన‌యం ఉన్నా ఛాన్సులు లేక నిరాశ‌తో ఇండ‌స్ట్రీని వ‌దులుతున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న మిర్చి సినిమాలో న‌టించిన రిచా గంగోపాధ్యాయ్ అస‌లు ఇక సినిమాల్లో న‌టించ‌న‌ని చెప్పి గుడ్ బై చెప్పేసి స్ట‌డీస్ అంటూ అమెరికాకు వెళ్లిపోయింది. అక్క‌డ త‌న‌కు న‌చ్చిన వాడిని  పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడిదే బాటలో మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె కూడా సినిమాల‌కు ఫుట్ స్టాప్ పెట్టేసిన‌ట్టు చెప్పేసింది.



ఆమె త‌న సోష‌ల్ మీడియాలో తాను సినిమాల నుంచి నిష్క్ర‌మించ‌డం వెన‌క చాలా బాధ‌గా ఉంద‌ని... సౌత్ సినిమాలతో విసుగెత్తిపోయాను. బ్రిటిష్ టెలివిజన్ షోలో నాకు ఓ గుర్తింపు వచ్చింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఏజెన్సీ గిల్బర్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాను.. లండ‌న్‌కు కూడా షిఫ్ట్ అవుతున్నాను.. నాకు అక్క‌డ మంచి గుర్తింపు ఉంటుంద‌ని కూడా చెప్పింది. ఇక నికిషా గ‌తంలో బాలీవుడ్ సినిమాలు చేసేందుకు లండ‌న్ నుంచి వ‌చ్చింది.



తెలుగులో ప‌వ‌న్ స‌ర‌స‌న కొమరం పులి సినిమాలో న‌టించింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించినా ఆమెకు గుర్తింపు రాలేదు. చివ‌ర‌కు విసిగిపోయి సినిమాల‌కు గుడ్ బై చెప్పి చివ‌ర‌కు లండ‌న్ టెలివిజ‌న్ షోలు చేసుకునేందుకు డిసైడ్ మ‌కాం మార్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: