గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాను అందించే సంగీతం అస్సలు బాలేదంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాత ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాడని అస్సలు కొత్తదనం ఉండట్లేదని కంప్లైంట్స్ వచ్చాయి. ఒకప్పుడు దేవి సంగీతం ఇచ్చిన సినిమాలో మూడుకి మించి పాటలు సూపర్ హిట్ అయ్యేవి. అలాంటిది కొత్తదనం లేకుండా ఏదో చేశామా అంటే చేశాము అన్నట్టుగా సంగీతం అందిస్తున్నాడని విమర్శలు వచ్చాయి.

 

మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంగీతం అందించిన దేవి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. సరిలేరుకి పోటీగా వచ్చిన అల వైకుంఠపురములో పాటలు ఛార్ట్ బస్టర్లు అవుతుంటే సరిలేరు పాటలు వాటికి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో దేవి పని అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కొత్తదనాన్ని అందుకోవట్లేదని, పాత పద్దతిలోనే ఉండిపోతున్నాడని సోషల్ మీడియాని హోరెత్తించారు.

 

అయితే దేవి మళ్ళీ బ్యాక్ అయ్యాడు. అవును ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల ఉప్పెన సినిమా నుండి ఒక పాట రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నీ కన్ను నీలి సముద్రం అనే పాటకి శ్రోతల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్ కి కూడా అసోసియేషన్ ఉంది.

 


సుకుమార్ తో అసోసియేషన్ ఉండడం వల్లే దేవి శ్రీ ప్రసాద్ ఇంత మంచి పాటని చేశారని అంటున్నారు. ఏ డైరెక్టర్ కి ఏ విధంగా మ్యూజిక్ వచ్చినా సుకుమార్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా అలర్ట్ అయిపోయి మంచి ఛార్ట్ బస్టర్లు ఇస్తాడు. ఈ విషయం కుమారి ౨౧ఎఫ్ విషయంలోనూ చూశాం. మొత్తానికి ఎలాగైతేనేం దేవిశ్రీ ప్రసాద్ మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: