చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన  అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా తో మంచి క్రేజ్ సంపాదించిన రష్మిక మందన ఆ తర్వాత మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుని సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా బంపర్ విక్టరీ సాధించడంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో  క్యూట్ గా కనిపించి  అందరిని స్వీట్ గా మెస్మరైజ్ చేసింది. 

 

 

 

 

 ఇక ఆ తర్వాత యువ హీరో నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం దర్శకనిర్మాతలు అందరికీ స్టార్ హీరోల సినిమాలు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రష్మిక మందన్న. కేవలం టాలీవుడ్ లోనే కాదు అటు తమిళ కన్నడ భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బిజీగా ఉంది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే తాజాగా రష్మిక మందన ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకనుంచి రష్మిక మందన కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుందట. వాస్తవంగా అయితే రష్మిక మందన కు నాన్ వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట.

 

 

 కానీ నాన్ వెజ్ కి ఇప్పటితో స్వస్తి పలికి.. వెజిటేరియన్ గా మారిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం హీరోయిన్ గా  టాప్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తన ఫిజిక్ ను  కాపాడుకోవడానికే నాన్ వెజ్ కు దూరంగా ఉంటూ వెజిటేరియన్ గా మారాలి అనుకుంటుంది అని పలువురు అంటున్నారు. అంతేకాదు జీవితాంతం ఇక నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉండాలని కఠిన నిర్ణయం తీసుకుందట రష్మిక మందన. అయితే దీనిపై అటు నెటిజన్లు కూడా కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు అని కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే..  ఇంకొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా సరైన వ్యాయామం చేస్తే సరిపోతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: