టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ నటించి ప్రస్తుతం అవకాశాలు లేక తెర మీద ఎక్కడా కనిపించకుండా పోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో  పాటు సీనియర్ హీరోలందరి సరసన నటించింది అనే చెప్పాలి. ఇక ఈ అమ్మడికి క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. ప్రతి సినిమాలో అందాల ఆరబోత చేస్తూ తెలుగు ప్రేక్షకులు అందరినీ పరేషాన్  చేసింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తనకు అవకాశాలు రాకపోవడానికి తాను చేసిన తప్పే కారణం అంటుంది రకుల్ ప్రీత్  సింగ్ ... 

 

 

 ఏదైనా అనుభవంలోకి వచ్చేవరకూ తెలియదంటూ చెబుతోంది.అయితే ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత అటు  తెలుగులో కూడా ఓ సినిమాలో నటిస్తోంది. అయితే నటిగా తన ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించుకున్నప్పుడు తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటో తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తాను ఎక్కువగా అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చామని... అది పెద్ద తప్పు అని ఇప్పుడు అర్థమైంది అంటూ చెబుతోంది. ఇప్పటివరకు ఏ దర్శక నిర్మాతకు గాని అందాల ఆరబోతలో పారితోషికం విషయంలో ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టలేదని..  అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ తనకు అవకాశాలు తగ్గి పోవడానికి తన అందాల ఆరబోత కారణం అంటుంది రకుల్.

 

 

 తాను తన కెరీర్ మంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న  సమయంలో కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అయ్యాయని.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకో లేదు అని తెలిపిన ఈ అమ్మడు అందుకే అవకాశాలు తగ్గాయని చెబుతోంది. అయితే ప్రస్తుతం తాను నాన్వెజ్ మానేసి శాఖాహారానికి మారాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఏదేమైనా అంతా జరిగి పోయిన తర్వాత పశ్చాత్తాపం చెందితే మాత్రం ఏం లాభం చెప్పండి. ఎప్పుడైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అవకాశాలన్నీ చేజారిపోయాక   ఇప్పుడు అసలు విషయం తెలుసుకొని బాధపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: