పవన్ కళ్యాణ్ కు అభిమానులు కాదు భక్తులు ఉంటారు అంటూ దర్శకుడు  హరీష్ శంకర్ అనేక సార్లు ఓపెన్ గానే చెపుతూ ఉంటాడు. ఇప్పడు హరీష్ శంకర్ కు ఉన్న ఆ భక్తి భావన అతడికి చిరంజీవి తో సినిమా చేసే అవకాశాన్ని తృటిలో పోగొట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ నటించిన మళయాళం సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే.

 

చిరంజీవి హీరోగా ఈ సినిమాను నిర్మించాలనేది చరణ్ ప్లాన్. వాస్తవానికి ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో నిర్మించాలని చరణ్ పట్టుపట్టి సుకుమార్ చేత ఈ మూవీ స్క్రిప్ట్ ను అంతా పూర్తి చేయించాడు. అయితే సుకుమార్ అల్లు అర్జున్ మూవీ ప్రాజెక్ట్ లో చిక్కుకోవడంతో సుకుమార్ తో చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ అటక ఎక్కింది. 

 

దీనితో ఈ మూవీకి దర్శకుడిగా హరీష్ శంకర్ ను పెట్టి రీమేక్ చేయాలని చరణ్ ఆలోచనలు కొనసాగాయి. అయితే ఇప్పుడు హరీష్ నో చెప్పడంతో వినాయక్ పేరును పరిశీలిస్తున్నారట. మెగాస్టార్ సినిమాకు హరీష్ శంకర్ నో  చెప్పడంతో షాక్ అయిన చిరంజీవి ఇప్పడు వినాయక్ ను రంగంలోకి డింపినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి హరీష్ ఇలా ప్రవర్తించడం వెనుక ఒక కారణం ఉంది. 


ప్రస్తుతం  హరీష్   పవన్ కళ్యాణ్ మైత్రి మూవీస్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రాసేపనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘గబ్బర్ సింగ్' తర్వాత పవన్ తో సినిమా చేసే అవకాశం రావడంతో హరీష్ కు ఈ ఆఫర్ ను వదులుకోవడం ఇష్టం లేదట. అందుకే మెగాస్టార్ ను వ్యక్తిగతంగా కలిసి పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ వచ్చిందని ఈ సినిమా తర్వాత  చిరంజీవితో సినిమా చేయడానికి రెడీగా ఉంటానని రిక్వెస్ట్ చేసుకున్నాడట. అంతేకాదు చిరంజీవి కోసం ఒక మంచి స్క్రిప్ట్ కూడా తన దగ్గర ఉన్న విషయం వెల్లడించాడట. విషయం అర్థంచేసుకున్న  చిరంజీవి హరీష్ శంకర్ కు పవన్ పై ఉన్న భక్తికి ఆశ్చర్య పోతున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: