టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ నటించిన కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యాంది హైదరాబాద్ బ్యూటీ టబు.  మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే మరో స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. కృష్ణవంశి దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో ఒక్కసారే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించింది.  ఇలా వరుసగా తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన టబు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడే స్థిరపడింది.  వాస్తవానికి బాలీవుడ్ లో తన అక్క  పర్హా నాజ్ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అక్క బాటలో వెళ్లిన టబు సైతం అప్పటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ అమ్మడు తన వయసు కు తగ్గ పాత్రల్లో నటిస్తుంది.  


ఈ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీలో నటించింది.  తాజాగా భీష్మ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు నితిన్. తన తదుపరి సినిమా పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.  ఇటీవల బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ రిమేక్ చేయాలని అనుకున్నాడు.  కానీ ఈ మూవీ లో నటించేందుకు తాను మానసికంగా సిద్దంగా ఉండాలని కామెంట్స్ చేశాడు. కానీ, భీష్మ విజయం సాధించడంతో ఆ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధం అయిపోయారు. అంధాదున్ హిందీలో టబు కీలక పాత్ర పోషించారు.  ఆ పాత్ర కోసం గతంలో టబు ని సంప్రదించగా ఆమె నో చెప్పారట.  దాంతో ఆ పాత్ర కోసం హాట్ బ్యూటీ యాంకర్ అనసూయను తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు టబు ముందు సినిమా చేయడానికి అంగీకరించకపోయినా నితిన్ మాత్రం ఆ పాత్ర ఆమె చేయాలని పట్టు పెట్టారట. దీంతో ఆమెను ఒప్పించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారట. ఈ ప్రాసెస్ లో నితిన్ తన గురువు త్రివిక్రమ్ సహాయం కోరారట. త్రివిక్రమ్ కూడా తన శిష్యుడి కోసం టబు తో మాట్లాడి ఈ రీమేక్ చేయడానికి ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే, అనసూయ కు ఒక మంచి పాత్ర చేజారిపోయినట్టే.. మొత్తానికి అనసూయకు టబు చెక్ పెట్టినట్టే అంటున్నారు.  ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: