టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా విజయంతో హ్యాట్రిక్ సాధించారు మహేష్ బాబు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే దానిపై మాత్రం ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. మహర్షి సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు వంశీ పైడిపల్లి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. సినిమా పట్టక్కవలసి ఉంది. 

 

 

 ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సినిమా తెరకెక్కబోతుంది అనుకుంటున్న సమయంలో స్క్రిప్టు నచ్చకపోవడంతో మహేష్ బాబు ఆలోచన మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే గీతగోవిందం లాంటి మంచి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం.. దీనిపై జరిగిన ప్రచారం కూడా వంశీ పైడిపల్లి ని బాగా బాధించాయని సమాచారం. అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా మరో కథకు సంబంధించిన లైను సూపర్ స్టార్ మహేష్ బాబు కి వినిపించాడట. 

 

 

 ఇక వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ మహేష్ బాబు కూడా నచ్చడంతో ఈ లైన్ కి ఓకే చెప్పేశాడట మహేష్ బాబు. అయితే ఈ లైన్ పై పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ చేయడం అనేది ఇప్పట్లో అయ్యేపని కాదు కాబట్టి ప్రస్తుతం... పరశురాం తో ఓ సినిమాను తెరకెక్కించిన అనంతరం ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అయితే మామూలుగానే వంశీ పైడిపల్లి సమస్యలు వచ్చినప్పుడు ఎంతో సహనంగా ఉండి ఎదుర్కొంటాడు అని అంటుంటారు. ఈ విషయాన్ని వంశీ పైడిపల్లి మరోసారి నిరూపించారు. అయితే మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తుంది అనుకున్న సినిమా రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: