పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుంది. సుమారు 10రోజుల పాటు జరిగే  ఈషెడ్యూల్ లో ఓ సాంగ్ తోపాటు కొన్నికీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
 
ఇక ఈ చిత్రం లో పవన్ సరసన కీర్తి సురేష్ నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా కోసం ఓ కొత్త నటిని హీరోయిన్ గా తీసుకున్నారట. నార్త్ కు చెందిన ఆ హీరోయిన్ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలక పాత్రలో నటించనుండగా అర్జున్ రాంపాల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ ఏడాది చివర్లో  ఈ సినిమా ను విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే  ఈ సినిమా కన్నా ముందుగానే పవన్ , ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వకీల్ సాబ్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ సూపర్  హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనుండగా అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఈ సినిమా నుండి  విడుదలైన  ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొంది. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: