యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో అదిరిపోయే హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. చత్రపతి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో మాస్ తరహా సినిమా లాగా ఏ డైరెక్టర్ చూపించలేకపోయారు. ఇటువంటి తరుణంలో కొరటాల శివ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మిర్చి సినిమా అదిరిపోయే రేంజ్ లో ప్రభాస్ కెరీర్లో విజయం సాధించింది. కొరటాల శివ సినిమా ఇదే కావటంతో ...ఆ సమయంలో కొరటాల పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఆ తర్వాత ప్రభాస్ 'బాహుబలి' సినిమా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి దేశ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

 

ఆ తర్వాత 'సాహో' సినిమా చేసిన ప్రభాస్ దారుణమైన పరాజయాన్ని చూడటం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మళ్లీ కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయడానికి ఇటీవల ఓకే అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. చిరంజీవితో సినిమా అయిన వెంటనే కొరటాల శివ... ప్రభాస్ తో కలిసి సినిమా చేయడానికి అంతా ఓకే చేసుకున్నట్లు ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

'సాహో' సినిమా కోసం రెండు సంవత్సరాలు టైం కేటాయించిన ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో ఒకే చేయడంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. మొత్తం మీద దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అన్న వార్త ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు డ్యాన్స్ వేసే న్యూస్ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: