టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా హీరోలతో సినిమాలు తీయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు.. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ టాంటి బ్లాక్ బస్టర్ అందించారు హరీష్ శంకర్. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ తో మంచి విజయం అందుకున్నాడు. గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘ గద్దలకొండ గణేష్’ మూవీ తెరకెక్కించారు. ఈ మూడు మూవీస్ మంచి విజయం అందుకోవడం మాత్రమే కాదు ఇందులో హీరోలను కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు హరీష్ శంకర్. ఆ మద్య పవన్ కళ్యాన్ తో హరీష్ కశంకర్ ఓ మూవీ తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ ఉంటుంది.. కానీ ఎప్పుడు అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు హరీష్ శంకర్.
ప్రస్తుతం తాన స్క్రిప్ట్ విషయంలో కసరత్తు చేస్తున్నానని అన్నారు. తాజాగా హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే సైబరాబాద్లో ఉన్న తన హోటల్ బాల్కనీ పూర్తిగా పాడైపోయి ఇలా ఉందంటూ ప్రముఖ జర్నలిస్ట్, దిప్రింట్ వ్యవస్థాపకుడు శేఖర్ గుప్తా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి కారణం ఇక్కడ విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని.. కాలుష్యం, వ్యర్థాలు, శబ్దాలు ఎక్కువయ్యాయని తెలిపారు. కిటికీలను కూడా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హరీష్ శంకర్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మీరు చెడు ప్రచారం చేయాలనుకుంటే మంచి కథను ఎంచుకుని చేయండి.. అంతేగానీ, ఇటువంటి అసత్య ఆరోపణలతో రాష్ట్రాన్ని నిందించకండి. టీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో ఇప్పటివరకు మేము 'పవర్ ఫుల్' గా ఉన్నాం' అని హరీశ్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 24గంటలు కరెంట్ ఉంటుందన్నది ఆయన ఉద్దేశం.
If u want to do bad propoganda try to pickup a better story..... dont balme our state by false allegations..... as of now we r
— harish shankar .S (@harish2you) March 4, 2020
“ Powerful “ under the leadership of @trspartyonline @KTRTRS ..... https://t.co/yvBnO9PU5v