టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాలతో స్టార్ హీరోల సరసన నటించారు నటి కవిత.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె అమ్మ, అత్త పాత్రల్లో నటించింది.  ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల క్యారవ్యాన్ గురించి మట్లాడిన విషయం తెలిసిందే. నటీనటులకు సౌకర్యాలు పెరిగిపోవడం వల్ల షూటింగ్ పనిదినాలు పెరిగిపోయాయి. నిర్మాతలు ఇప్పటికే కోట్లు ఖర్చు పెరుగుతున్నాయి. అప్పట్లో మేము క్యారవ్యాన్ లని కేవలాం బాత్రూం, మేకప్ కోసమే ఉపయోగించుకునేవాళ్ళం. సన్నివేశం అయిపోగానే అందులోకి వెళ్లే సౌకర్యం ఉండేది కాదని.. బయటనే కూర్చునేవాళ్లం అని అన్నారు.  

 

తాజాగా చిరంజీవి వ్యాఖ్యలపై ఆమె స్పందించి మాట్లాడుతూ.. చిరంజీవి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం అని ఆమె అన్నారు. చెట్ల కిందే మేకప్ వేసుకోవడం, భోజనం చేయడం  అంతేందుక మా బట్టలు కూడా చెట్ల చాటున మార్చుకునే వారిమని అన్నారు.  ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఓ ఛేదు అనుభవం ఆమె చెప్పి బాధపడ్డారు.  ఓ మూవీ షూటింగ్ లో నేను బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. అందుకోసం హీరోయిన్ క్యారవ్యాన్ ఉపయోగించుకోవాలని అనుకున్నాను.  ఆమె కొత్త హీరోయిన్... అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు.  

 

నేను క్యారవ్యాన్ లో బట్టలు మార్చుకోవానికి ఆమె ఒప్పుకోలేదు.. సినియర్ నటి అన్న విషయం మర్చిపోయి నన్ను తిట్టింది.  ఇది నా క్యారవ్యాన్.. మీరు ఎలా వెళతారు అని వాదించింది.  ఆ సమయంలో నిర్మాత కూడా అక్కడే ఉన్న చూస్తు ఉన్నారే తప్ప ఏమీ అనలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను.  ఇప్పుడు వస్తున్న నటీమణుల్లో కొంత మంది ఎవరినీ లెక్కచేయరు.. నిర్మాత, దర్శకుల ముందు కాలు మీద కాలు వేసుకొని సొల్లు కబుర్లు మాట్లాడుతుంటారు.  ఒకప్పుడు ఎంత సీనియర్ నటులు అయినా సరే పెద్దవారికి గౌరవం ఇచ్చే వాళ్లమని ఇప్పుడు ఆ సంస్కృతి ఎక్కడా కనిపించడం లేదని కవిత వాపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: