రన్ రాజా రన్ తో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాంతో ఒకే దెబ్బకి ప్రభాస్ వద్దకి వెళ్ళిపోయాడు. ప్రభాస్ తో చేసిన పాన్ ఇండియా ఫిలిమ్ సాహో బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ పర్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఆకాశంలో ఉంటే సినిమా చూసేసరికి నేలమీదకి వచ్చేశాయి. అయితే సినిమా అలా రావడానికి కారణం డైరెక్టర్  తప్పిదమే అని సుజిత్ ని వేలెత్తి చూపించారు.

 

ప్రభాస్ కి అంతటి భారీ డిజాస్టర్ ఇచ్చిన తర్వాత సుజిత్ కి ఇక ఛాన్సులు రావడం కష్టమే అనే మాట వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం సుజిత్ ని పిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధం అవుతున్నాడట. కొరటాల శివతో సినిమా పూర్తయ్యాక మళయాల చిత్రమైన లుసిఫర్ తెలుగు రీమేక్ చేయాలనుకుంటున్నాడని తెలిసిందే. అందువల్ల ఆ సినిమాని డైరెక్ట్ చేయడానికి సుజిత్ కి ఛాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మెగాస్టార్ కి సాహో సినిమాలో స్టైలిష్ మేకింగ్ బాగా నచ్చిందట. లూసిఫర్ సినిమాని స్టైలిష్ గా తీర్చిదిద్దడానికి సుజిత్ అయితే బెస్ట్ ఆప్షన్ అని  అనుకుంటున్నాడట. స్టైలిష్ గా తీర్చిదిద్దడం సుజిత్ కి అప్పజెప్పేసి, ఎమోషన్స్ పార్ట్ తాను చూసుకుంటానని ఫీల్ అవుతున్నాడట. మరి ఈ అవకాశం సుజిత్ ని వరిస్తుందా లేదా చూడాలి. ఇప్పటికే ఈ సినిమాని డైరెక్ట్ చేయమని సుకుమార్ దగ్గరి నుండి కొరటాల, పరశురామ్, హరీష్ శంకర్ ల వరకి వెళ్ళింది.

 

కానీ వారికి ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల వారు తెరకెక్కించడానికి రెడీగా లేరు. చివరికి వివి వినాయక్ తో తీయించాలని భావించినప్పటికీ.. ప్రస్తుతం మరొక ఆప్షన్ గా సుజిత్ ని పరిశీలిస్తున్నారట. మరి అన్నీ కుదిరి సుజిత్ తో చిరంజీవి సినిమా కుదురుతుందా లేదా అన్నది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: